ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు: ఎంపీపీ సూడి శ్రీనివాసరెడ్డి

నవతెలంగాణ – గోవిందరావుపేట
తెలంగాణ ఉద్యమ కెరటం ములుగు జిల్లా మాజీ జెడ్పి చైర్మన్ కుసుమ జగదీష్ జిల్లా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని మండల ఎంపీపీ సూది శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలో కుసుమ జగదీష్ ప్రధమ వర్ధంతి సభ మండల అధ్యక్షుడు లాకావత్ నరసింహనాయక్ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. జగదీష్ చిత్రపటానికి పూలమాలలు వేసి పలువురు నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. కుసుమ జగదీష్ అన్న ఆశయాలు ములుగు జిల్లా నాయకత్వంలో ఒక్కొక్కటిగా నెరవేరుతున్నాయన్నారు వారు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమని వారి ఆశయాలను నెరవేర్చుటలో మనం ముందుండాలని  వారు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో గోవిందరావుపేట మాజీ రైతు బందు కోఆర్డినేటర్ పిన్నింటి మధుసూదన్ రెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షులు అక్కినపల్లి రమేష్, కో ఆప్షన్ సభ్యుడు ఎండి బాబర్, ఉట్ల పృథ్విరాజ్, సీనియర్ నాయకులు డాక్టర్ హేమాద్రి, మాజీ సర్పంచ్ వాగ చల్వాయి గ్రామ కమిటీ అధ్యక్షులు నామ్ పూర్ణచందర్,అధికార ప్రతినిధి బూరెటి మధు, సీనియర్ నాయకులు ఉట్ల మోహన్, గోవిందరావుపేట మండలం మహిళా అధ్యక్షురాలు బత్తుల రాణి, బై కానీ ఓదెలు, కొండి రమేష్, అన్ని గ్రామాల గ్రామ కమిటీ అధ్యక్షులు ఉద్యమకారులు సీనియర్ నాయకులు వివిధ సంఘాల అధ్యక్షులు కార్యకర్తలు సోషల్ మీడియా వారియర్స్ మహిళలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు.
Spread the love