![](https://navatelangana.com/wp-content/uploads/2024/06/Screenshot_2024-06-06-17-30-07-594-edit_com.whatsapp.jpg)
ప్రభుత్వ పాఠశాలల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎంపీడీఓ వేణుమాధవ్ అన్నారు. శుక్రవారం మండలంలోని కొరిపల్లి ప్రాథమికోన్నత పాఠశాల, శంకర్ తండా ప్రాథమిక పాఠశాలల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను అమ్మ ఆదర్శ పాఠశాలల ఏఈ అశోక్ తో కలిసి సందర్శించారు. స్కూళ్ళలో నీటి సరఫరా, విద్యుత్ పరికరాల ఏర్పాటు, మరుగుదోడ్ల మరమ్మతు, తాగునీటి సదుపాయం, పాఠశాలల ఆవరణలో మరమ్మతు తదితర పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అమ్మ ఆదర్శ పాఠశాల కింద ఆయా స్కూళ్ళలో మరమ్మతు పనులు పక్కా ప్రణాళికతో పూర్తి చేయాలన్నారు.