గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి: ఎంపీఓ సత్యనారాయణ 

నవతెలంగాణ – పెద్దవంగర
గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పెద్దవంగర గ్రామ ప్రత్యేక అధికారి ఎంపీఓ సత్యనారాయణ అన్నారు. శుక్రవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సభ నిర్వహించారు. గ్రామ సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమలతో పాటుగా ప్రజలు సైతం గ్రామాల అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌, గ్రామపంచాయతీల నిధులతో గ్రామంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతామన్నారు. గ్రామాల్లో పలు ఫార్మేషన్ రోడ్లకు తీర్మానం చేసినట్లు తెలిపారు. పల్లె దావఖాన వైద్యాధికారి మహిపాల్ మాట్లాడుతూ.. ప్రజలు తమ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. రాబోయే వర్షాకాలం న దృష్టిలో ఉంచుకుని, సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో  పంచాయతీ కార్యదర్శురి వెంకన్న, ఏఎన్ఎం హరిత, ఆశ కార్యకర్తలు కవిత, సునిత, మంజుల తదితరులు పాల్గొన్నారు.
Spread the love