అధికారుల అలసత్వంతో ఎంపీటీసీల ఆగ్రహం..

– అధికార పార్టీ అండదండలతో అవిశ్వాసానికి కోర్టు స్టే తెచ్చిన ఎంపీపీ గజ్జల సాయిలు
– అభివృద్ధి గుర్తుకు రానిది, స్టే తేవడం ఎలా సాధ్యమైందని ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీటీసీలు 
నవతెలంగాణ – మిరుదొడ్డి 
అధికారుల అలసత్వంతో ఎంపీటీసీలు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎంపీపీ గజ్జల సాయిలుపై అవిశ్వాసం ఎంపీటీసీ సభ్యులు పెడితే కావాలనే అధికారులు అవిశ్వాసం కాకుండా ప్రయత్నాలు చేస్తున్నారని వైస్ ఎంపీపీ పోలీస్ రాజులు ధ్వజమెత్తారు. మిరుదొడ్డి మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీటీసీ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చట్ట ప్రకారం ఎంపీపీ గజ్జల సాయిలు పై అవిశ్వాసం పెడితే,చట్టంలో ఉన్న లోసుగులతో అవిశ్వాసం ఎంపీపీ గజ్జల సాయిలు పేట్టకుండా అధికారులు చూస్తున్నారని ఆరోపించారు. గ్రామాల అభివృద్ధి చేయడానికి ఆలోచించని ఎంపీపీ సాయిలు నేడు అవిశ్వాస తీర్మానం చేయగానే ఎంపిటిసిలపై కోర్టు స్టే తీసుకురావడం సరికాదని మండిపడ్డారు గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వ నుండి నిధులు కేటాయించాలని ఆరోపించారు. నిధులు మంజూరు చేయకపోవడం మూలంగానే ఎంపీపీ పై అవిశ్వాస తీర్మానం చేయడం జరిగిందని ఎంపిటిసిలు ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంల ఉన్నప్పుడు సొంత గ్రామానికి ఎక్కువగా నిధులు పెట్టడం జరిగిందని ఆరోపించారు ఎంపీటీసీలతో మభ్యపెడుతూ మాయమాటలు చెబుతూ వారికి సరియైన స్థాయిలో నిధులు మంజూరు చేయకపోవడం మూలంగా ఎంపిటిసిలు ఎంపీపీ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల పరిషత్ నిధులు దుర్వినియోగం చేశారని ఎంపీటీసీలు ఆరోపించారు. ఇప్పటికే రెండుసార్లు అవిశ్వాసం పెట్టేందుకు అధికారులు సమయం కేటాయించి ,వాయిదా వేయడం పట్ల ఎంపీటీసీ సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. అధికారుల తీరుపై త్వరలోనే కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి లక్ష్మి,నర్సింలు, బాల మల్లేశం, శ్రీనివాస్ ,రాజవ్వ, లక్ష్మి, లలిత పలువురు పాల్గొన్నారు.
Spread the love