కేజీబీవీ పాఠశాలలో జాతీయ బాలికా దినోత్సవం

నవతెలంగాణ – మాక్లూర్
మండల కేంద్రంలోని కస్తూర్చ గాంధీ బాలికా విద్యాలయంలో జాతీయ బాలికల దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక పోలీస్ పోస్టేషన్ ఏఎస్ఐ పి. నర్సయ్య, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎంపీచ్ఎ  రాజ్యలక్ష్మి ముఖ్య అధిఖములుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు బాల్యవివాహాల నిర్మూలనపై అవగాహన కల్పించారు.  బాల్యవివాహాలు చేసుకున్నా, ప్రోత్సహించినా కూడా చట్టరిత్యా నేరస్థులు అవుతారని తెలిపారు. బాల్య వివాహాలు చేసుకుంటే కలిగే ఆరోగ్య సమస్యల గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ఎం. శ్రీనివాస్, ఆశావర్కర్లు శిరీష, జయశ్రీ,  పాఠశాల ఉపాద్యాయులు, విధ్యార్థులు పాల్గొనడం జరిగింది.
Spread the love