– కండువా కప్పిన దీపాదాస్మున్షి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
బీఎస్సీ నేత నీలం మధు కాంగ్రెస్లో చేరారు. వందలాది మంది తమ అనుచరులతో కలిసి ఆయన గురువారం హైదరాబాద్లోని గాంధీ భవన్లో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకు న్నారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దీపా దాస్ మున్షి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ ఇందిరాశోభన్ పోశాల కూడా దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు.
కాంగ్రెస్ గూటికి నేడు బీఆర్ఎస్ నేతలు
పలువురు బీఆర్ఎస్ నేతలు శుక్రవారం కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో జీహెచ్ఎంసీ ప్రస్తుత డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతతోపాటు వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి, రంగారెడ్డి జెడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మహేందర్ రెడ్డి, తీగల కృష్ణారెడ్డి మరికొందరు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.