- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం ఎర్రగడ్డతండాలో దారుణం జరిగింది. ఇంటిపక్కనున్న వేపచెట్టు విషయంలో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ఇరువర్గాలు పరస్పరం గొడ్డళ్లతో దాడులకు దిగారు. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఇరువర్గాలను ఆపే క్రమంలో మేళ్లచెరువు ఎస్ఐ నవీన్కుమార్కు గాయాలయ్యాయి. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
- Advertisement -



