కుల, ఆదాయ సర్టిఫికెట్లు ఇవ్వడంలో తహసీల్దార్ కార్యాలయం నిర్లక్ష్యం

– తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు 
నవతెలంగాణ – మిరుదొడ్డి 
తహసీల్దార్ కార్యాలయంలో కుల ఆదాయ సర్టిఫికెట్ అందించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా ను చేపట్టారు. మిరుదొడ్డి తహసిల్దార్ కార్యాలయం ముందు విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. విద్యార్థులకు కావలసిన సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ రోజులు గడిచిన సర్టిఫికెట్లు అధికారులు ఇవ్వడం లేదని ఆరోపించారు. కుల ఆదాయ బీసీ సర్టిఫికెట్ల కోసం నెల రోజులుగా తిరుగుతున్నామని ఆరోపించారు. కార్యాలయం చుట్టూ రోజు తరబడి తిరుగుతున్నప్పటికీ సర్టిఫికెట్లు అందజేయడం లేదన్నారు. సర్టిఫికెట్లు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి విద్యార్థులకు సర్టిఫికెట్లు వచ్చేలా చూడాలని డిమాండ్ చేశారు.
Spread the love