పీఎం కిసాన్ యోజన లైవ్ ప్రోగ్రాంలో నివేదిత రెడ్డి

నవతెలంగాణ – పెద్దవూర
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం సాయంత్రం 05:00 గంటలకు ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుండి పీ ఎం కిసాన్ పథకం యొక్క 17వ విడతను విడుదల చేయు సందర్బంగా త్రిపురారం మండలం లోని కృషి విజ్ఞాన కేంద్రం లో లైవ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని బీజేపీ నాగార్జునసాగర్  నియోజకవర్గ ఇంచార్జి శ్రీమతి నివేదిత రెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు వెంకట్ రెడ్డి,  జిల్లా కార్యదర్శి పేదోంటి శిరీష, హాలియా మండల అధ్యక్షులు ప్రవీణ్, త్రిపురారం మండల కన్వీనర్ పొనుగోటి హరీష్ సీనియర్ నాయకులు సిద్ధాంతి కృష్ణ, మేకల రామక్రిష్ణ, కోప్పు సోమయ్య, రెమడాల రమేష్, వల్లపు దాసు హుస్సేన్, వాకుడోతూ వసంత్, మామిడి మహేష్, బోస్కా నాగరాజు రైతులు  తదితరులు విక్షించారు.
Spread the love