- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో ఎవరూ గీత దాటి మాట్లాడకూడదని, రాజగోపాల్ అలా మాట్లాడటం సరికాదని పార్టీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజగోపాల్ రెడ్డి ఆవేదన, ఆందోళనను అర్థం చేసుకున్నామని, అయితే ఏం మాట్లాడినా అది పార్టీ అధిష్టానం దృష్టికి పోతుందన్నారు. సీఎంకి, తనకు మధ్య గ్యాప్ లేదని, ఎవరి పని వాళ్లు చేసుకొని ముందుకెళ్తున్నామన్నారు. పార్టీ, ప్రభుత్వం వేర్వేరు కాదని, ఒకదానితో ఒకటి సమన్వయం ఉంటుందన్నారు.
- Advertisement -



