ఎన్టీఏ ఆఫీసులోకి దూసుకెళ్లిన ఎన్ఎస్‌యూఐ కార్య‌క‌ర్త‌లు

నవతెలంగాణ-హైదరాబాద్ : కాంగ్రెస్ స్టూడెంట్ వింగ్ ఎన్ఎస్‌యూఐకి చెందిన కార్య‌క‌ర్త‌లు ఇవాళ ఢిల్లీలోని నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆఫీసులోకి చొచ్చుకెళ్లారు. నీట్ మెడిక‌ల్ ఎంట్రెన్స్ ప‌రీక్ష‌ల్లో అక్ర‌మాలు జ‌రిగిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్న విష‌యం తెలిసిందే. అయితే నీట్ ప‌రీక్ష‌ను ర‌ద్దు చేయాల‌ని కోరుతూ కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఈ నేప‌థ్యంలో ఇవాళ ఆ పార్టీకి చెందిన విద్యార్థి విభాగం కార్య‌క‌ర్త‌లు.. ఎన్టీఏ ఆఫీసులోకి దూసుకెళ్లారు. సుమారు వంద మందికిపై కార్య‌క‌ర్త‌లు ఒక్క‌సారిగా ఎన్టీఏ ఆఫీసులోకి చొచ్చుకెళ్లారు. ఎన్టీఏ బిల్డింగ్‌లోకి వెళ్లిన విద్యార్థులు.. అరుపులు, కేక‌లు చేస్తూ ఆందోళ‌న చేప‌ట్టారు.

Spread the love