గృహజ్యోతి లబ్ధిదారుల పరిశీలనా, సర్వే

నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండలంలోని బషీరాబాద్ గ్రామంలో శుక్రవారం గృహజ్యోతి లబ్ధిదారుల పరిశీలనలో భాగంగా ఇంటింటి సర్వే నిర్వహించారు. అంగన్వాడి టీచర్లు, మహిళా సంఘాల వివోఏలు ఇంటింటికి వెళ్లి సర్వే చేశారు. ఈ సందర్భంగా ఆరు గ్యారంటీల అమలులో భాగంగా ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలన  కార్యక్రమంలో ఇదివరకే దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల యొక్క వివరాలను ఇంటింటికి వెళ్లి  చూశారు. గ్రామంలో గృహజ్యోతి పథకానికి అర్హులను గుర్తించేందుకు నిర్వహిస్తున్న లబ్ధిదారుల పరిశీలన సర్వేను సెర్ఫ్  ఏపిఎం కుంట గంగారెడ్డి, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఏబీఎన్ కుంట గంగారెడ్డి మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలోని అన్ని గ్రామాల్లో లబ్ధిదారుల పరిశీలన సర్వే కొనసాగుతుందన్నారు. సర్వే నిర్వహిస్తున్న సిబ్బంది లబ్ధిదారుల వివరాలను తప్పులు లేకుండా, సమగ్రంగా పరిశీలించాలన్నారు. అన్ని శాఖల అధికారులు ఈ సర్వేలో పాల్గొంటున్నట్లు తెలిపారు.
Spread the love