నవతెలంగాణ-హైదరాబాద్: ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ‘పద్మ’ అవార్డుల (Padma awards-2026) ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము () సోమవారం సాయంత్రం ఈ అవార్డులను ప్రదానం చేశారు. దేశంలోని పలు రంగాల్లో విశేష సేవలందించిన వారికి భారత గణతంత్ర దినోత్సవం వేళ కేంద్రం మొత్తం 131 మందికి పద్మ పురస్కారాలకు ఎంపిక చేసిన విషయం తెలిసిందే. తొలి విడతలో నేడు 66మందికి అందజేయగా.. మిగతా వారికి రెండో విడతలో నిర్వహించే కార్యక్రమంలో అవార్డులను అందజేస్తారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, కుమారస్వామి, గజేంద్రసింగ్ షెకావత్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా ‘పద్మ’ అవార్డుల ప్రదానోత్సవం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



