సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

నవతెలంగాణ – తిరుమలగిరి
మేరా సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి మండలి తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ కు తిరుమలగిరి చౌరస్తాలోని మేరా సంఘం ఆధ్వర్యంలో వారి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి, అధ్యక్షులు రామగిరి సోమేశ్ మాట్లాడుతూ  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రి మండలి తుంగతుర్తి శాసనసభ్యులు అభివృద్ధి ప్రదాత మందుల సామేలుకు  ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి మండల అధ్యక్షులు రామగిరి నాగేష్, కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్, ఉపేందర్, సీతారాములు, మధు, సురేష్, శ్రీనివాస్, వెంకన్న, సోమయ్య, కృష్ణ, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love