పంతంగి పూర్వ విద్యార్థుల ఆత్మీయ స‌మ్మేళ‌నం..

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్ మండలం పంతంగి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 1998-1999 విద్యా సంవత్సరానికి చెందిన పూర్వ విద్యార్థినీ, విద్యార్థులు మండల పరిధిలోని ధర్మోజీగూడెం శివారు జయశ్రీ గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో ఆదివారం నిర్వహించిన సిల్వర్ జూబ్లి (25 సంవత్సరం)ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు.ఆత్మీయ పలకరింపులు, ఆలింగనాల నడుమ నాటి మధుర స్మృతులను నెమరేసుకున్నారు.సరిగ్గా 25 ఏళ్ల తరువాత వారంతా ఒక చోట చేరి నాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఎంజాయ్ చేశారు. విద్యార్థి దశలో చిలిపి చేష్టలు మరువలేనివని,విద్యా బుద్ధులు నేర్పిన గురువులు సత్తయ్య,అంజయ్య,ధైవాదీనం ,సంజీవరెడ్డి,పాపయ్య,సత్యనారాయణ  ఉపాధ్యాయులను శాలువతో ఘనంగా సత్కరించి వారి ఆశీస్సులు స్వీకరించారు.అనంతరం తోటి విద్యార్థులు ఒకరినొకరు పలకరించుకుని వారి వారి కష్ట సుఖాలు తెలుపుకుని మోమోంటో లు అందజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు శాగ చంద్రశేఖర రెడ్డి, వెంకట్ రెడ్డి, మల్లేష్, వేణు కుమార్, సుధాకర్లిం గస్వామి, ముత్యాలు, జెనంద, మహేందర్, సురేష్, గోవర్ధన్, మహేశ్వర్, హిమబిందు, మహేశ్వరి, శ్రావణి, జ్యోతి, మంజుల, శోభరాణి , సంధ్యారాణి, పారిజాత, నాగమణి తదితరులు పాల్గొన్నారు.
Spread the love