వృద్ధాప్యంలో తల్లిదండ్రులను ఆదరించాలి: ఫాదర్ కే జోసెఫ్ 

నవతెలంగాణ – ధర్మసాగర్
వృద్ధాప్యంలో తల్లిదండ్రులను చిన్నపిల్లల లాగా ఆదరణతో చూడాలని విచారణ ఫాదర్ ఏ జోసెఫ్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని సెయింట్ ఆంటోని చర్చిలో అంతర్జాతీయ ఫాదర్స్ డే సందర్భంగా కేక్ కట్ చేసి ఘనంగా అంతర్జాతీయ ఫాదర్స్ డే ను నిర్వహించారు. ఈ సందర్భంగా తండ్రి తల్లి పాత్రలను యువతీ యువకులకు అర్థమయ్యే విధంగా వాక్య పరిచర్య చేశారు. అనంతరం వృద్ధులతో కేక్ కట్ చేయించి తండ్రి పాత్ర విశిష్టతను వివరించి వారి ఔన్నత్యాన్ని చాటి చెప్పారు. కార్యక్రమంలో సంఘ పెద్దలు మాచర్ల ప్రవీణ్ కొట్టి శ్రీనివాస్ కొట్టి యాదగిరి, పోలుమారి చిరంజీవి, నక్క సుధాకర్, ఉపదేశి గంగారపు కమలాకర్, గాయక బృంద సభ్యులు కొలుమారి గోపాల్, మాచర్ల ఏలియా కొట్టే సంజీవ తదితరులు పాల్గొన్నారు.

Spread the love