జన సైనికుడి కుటుంబానికి ఆర్థిక సహాయం: పర్నే శివారెడ్డి

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
గత నెల జనవరి 18న రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కొయ్యల గూడెం గ్రామానికి చెందిన సంగం చంద్రశేఖర్ కుటుంబానికి జనసేన పార్టీ ఆధ్వర్యంలో రూ.40,000 వేల రూపాయలు కుటుంబానికి శుక్రవారం జనసేన పార్టీ చౌటుప్పల్ మండలాధ్యక్షుడు శివారెడ్డి అందజేశారు.పర్నే శివారెడ్డి మాట్లాడుతూ మన నుంచి దూరమైన జన సైనికుడు క్రియాశీల సభ్యుడుకి పార్టీ అధినాయకత్వం నుంచి 5 లక్షల రూపాయలు అందజేస్తాము అని కుటుంబ సభ్యుల కి హామీ ఇచ్చారు.వారి కుటుంబానికి అండగా ఉంటాం అంటూ విరాళాలు అందించిన జనసైనికులకు,అభిమానులకు పేరు పేరున నా హృదయపూర్వక అభనందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో శ్రీకాంత్,మార్ల శ్రీశైలం,చెరుకు లింగస్వామి,మారగోని శివ,వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love