కలెక్టర్ కు పోస్ట్ కార్డులతో వినతిపత్రం..

నవతెలంగాణ – రాయపర్తి
మండలంలోని పన్యా నాయక్ తండా వసూలు తండా శివారులో నిర్మిస్తున్న ఈసి పౌల్ట్రీ ఫామ్ నిర్మాణాన్ని నిలిపివేయాలని ఆదివారం జిల్లా కలెక్టర్ కు పోస్ట్ కార్డులతో వినతిపత్రాలు పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోళ్ల ఫామ్ వల్ల రైతులు, ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉందని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా కోళ్ల ఫామ్ నిర్మించవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ భూక్యా క్రాంతి, మాజీ ఎంపీటీసీ మాలోతు దేశిరాం, నాయకులు డాక్టర్ భూక్యా రాజారాం నాయక్, భూక్యా రవి, నూనావత్ కిషన్, నూనావత్ శంకర్, భూక్యా దేవుల, భూక్యా లక్పపతి, భూక్యా గోపాల్, భూక్యా బుచ్చన్న, భూక్యా వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
Spread the love