Thursday, September 17, 2026
E-PAPER
Homeజాతీయంపెట్రోల్, డీజిల్ ఎగుమతి సుంకాల తగ్గింపు..

పెట్రోల్, డీజిల్ ఎగుమతి సుంకాల తగ్గింపు..

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌ : పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్‌ (విమాన ఇంధనం) ఎగుమతి సుంకాలను (లెవీలను) కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. డీజిల్‌పై లీటరుకు రూ.5, పెట్రోల్‌పై రూ.1, ఏటీఎఫ్‌పై రూ.4 చొప్పున కోత విధించింది. అయితే ఈ మార్పులు ఎగుమతులకే వర్తిస్తాయని, దేశీయంగా బంకుల్లో విక్రయించే పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా ప్రతి రెండు వారాలకు ఒకసారి ఈ సుంకాలను కేంద్రం సమీక్షిస్తుంటుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -