- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఐఫోన్ ఈఎంఐ చెల్లింపుల విషయంలో తల్లిదండ్రులతో గొడవపడిన కునాల్ (19) కొండపైకి వెళ్లాడు. కుమారుడిని కాపాడేందుకు తండ్రి మురళీధర్ (48) ప్రయత్నించగా.. ప్రమాదవశాత్తు ఇద్దరూ కొండపై నుంచి జారిపడి మృతిచెందారు. భర్త, కుమారుడి మృతితో తీవ్ర మనస్తాపానికి గురైన తల్లి సంగీత కూడా మృతిచెందింది. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతిచెందడంతో స్థానికంగా విషాదం నెలకొంది.
- Advertisement -


