రాష్ట్ర స్థాయికి నెట్ బాల్ క్రీడకి ఎంపికైన క్రీడాకారులు

నవతెలంగాణ – నాగార్జునసాగర్
నాగార్జునసాగర్ హిల్ కాలనీ లో గల సెయింట్ జోసెఫ్  హై స్కూల్ లో ఆదివారం జరిగిన జిల్లాస్థాయి సీనియర్ నెట్ బాల్ సెలక్షన్స్ జరిగాయి. ఈ సెలక్షన్స్ కు సుమారు 60 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వీరిలో 12మంది బాలురు12 మంది బాలికలు రాష్ట్రస్థాయి టోర్నమెంట్కు ఎంపికైయ్యారని నల్లగొండ జిల్లా నెట్ బాల్ అసోసియేషన్ సెక్రెటరీ జె.కిరణ్ కుమార్ తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం సాగర్(నందికొండ)పట్టణ అధ్యక్షుడు రమావత్ మోహన్ నాయక్ ,హిల్ కాలనీ టౌన్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ బాలాజీ నాయక్ పాల్గొని క్రీడాకారులను అభినందించారు. అలాగే సీనియర్ క్రీడాకారులు అయినటువంటి సంయుత్ నాయుడు మరియు ధనుష్ నాయక్ ఎంపికైన క్రీడాకారులకు క్రీడా దుస్తులు పంపిణీ చేశారు. రాష్ట్రస్థాయికి ఎంపికైన క్రీడాకారులు ఈనెల 30వ తారీకు నుంచి జూన్ ఒకటవ తారీకు వరకు హైదరాబాదులోని దోమలగూడలో జరిగే రాష్ట్రస్థాయి నెట్ బాల్ టోర్నమెంట్కు వెళ్ళనున్నారు.
Spread the love