– అధికారంలోకి వచ్చాక చర్యలు
– ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
నవతెలంగాణ – బంజారాహిల్స్
తాము అవినీతికి పాల్పడుతున్న అధికారులు, మంత్రుల పేర్లను బ్లాక్ బుక్లో రాస్తున్నామని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన ఫిల్మ్ నగర్ వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో బ్లాక్ బుక్లో మొదటగా మంత్రి పొన్నం ప్రభాకర్ పేరు చేర్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అవినీతికి పాల్పడిన మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికా రుల పేర్లను బ్లాక్ బుక్ లో రాస్తున్నానని తెలిపారు. వచ్చే ఐదేండ్ల తరువాత బీఆర్ఎస్ పార్టీ అధికారం లోకి రాబోతుందని అప్పుడు వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. మంత్రి పొన్నంపై తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని తెలిపారు. టీటీడీ ఆలయంలో సవాలు స్వీకరించి వచ్చానని.. మంత్రి సచ్చిల్లుడైతే సవాలును స్వీకరించి నిరూపించు కోవడానికి రావాలని సవాల్ విసిరారు. నిరాధా రమైన ఆరోపణలు చేయడానికి తనకే అవసరం లేదని ఉన్న వాస్తవాన్ని తాను తెలియజేస్తు న్నానన్నారు. ఈ విషయాన్ని మంత్రి గమనించి జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు.