- Advertisement -
నవతెలంగాణ – పరకాల
స్థానిక రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఆర్డీవో అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పరకాల డివిజన్ మరియు మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. ప్రజల నుంచి వివిధ సమస్యలపై మొత్తం 9 అర్జీలను స్వీకరించారు. వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు అందజేసి, వాటిని నిర్ణీత గడువులోగా పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని ఆర్డీవో డిఎస్ వెంకన్న అధికారులను ఆదేశించారు.
- Advertisement -



