ప్రభుత్వ పాఠశాల విద్య అన్ని విద్యాసంస్థల విద్య కంటే ఉత్తమమైన విద్య..

నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్ 
ప్రభుత్వ పాఠశాల విద్య అన్ని విద్యాసంస్థల విద్య కంటే ఉత్తమమైన విద్య అందిస్తాయని ఎంపీటీసీ కర్రె విజయ వీరయ్య అన్నారు. బుధవారం యాదగిరిగుట్ట మండలం మల్లాపురం, ప్రభుత్వ పాఠశాల ఆవరణంలో ఆదర్శ పాఠశాల కార్యక్రమం ప్రాథమిక పాఠశాలలో నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు కమలాకర్ అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీటీసీ కర్రే విజయ వీరయ్య  పాల్గొని, విద్యార్థులకు నూతన పుస్తకాలు, బట్టలు పంపిణీ చేశారు. కర్రే విజయ వీరయ్య మాట్లాడుతూ.. విద్యతో వికాసాన్ని పెంపొందించాలని, బడి ఈడున్న పతి పిల్లవాడు పాఠశాలలో చేర్పించాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలకు మల్లాపురం లో ఉన్న విద్యార్థులు చేరి, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వ విద్య అన్ని విద్యాసంస్థల కంటే మెరుగైన విద్య ప్రభుత్వ పాఠశాలలో అందిస్తున్నారు. గ్రామ విద్యార్థులందరూ ఉపయోగించుకోవాలని చెప్పారు .ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love