శ్రీ ఆనంద గిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పూర్ణాహుతి చక్రతీర్థం

నవతెలంగాణ – జక్రాన్ పల్లి 

జక్రాన్ పల్లి మండలం కొలిప్యాక్ గ్రామంలో శ్రీ ఆనందగిరి లక్ష్మినృసింహా స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పూర్ణహుతి చక్రతీర్థం అంగరంగ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు దండాల మోహన్ శర్మ , ఆలయ కమిటీ చైర్మన్ ప్రశాంత్ , వైస్ చైర్మన్ గడ్డం ముత్తెన్న,  మాజీ సర్పంచ్ ఆత్మకూరు గంగు బాలయ్య , మాజీ ఎంపీపీ ఢీకొండ హరిత శ్రీనివాస్, దీకొండ కిరణ్ , బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్ తెలంగాణ జాగృతి అధ్యక్షులు అజయ్ , గ్రామ ప్రజలు  తదితరులు పాల్గొన్నారు.
Spread the love