– టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
లోక్సభలో ప్రధాని మోడీకి దీటుగా ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్గాంధీ సమర్థవంతంగా వ్యవహరిస్తారని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్ ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంటులో మోడీ ఎమర్జెన్సీ గురించి మాట్లాడటం సరైంది కాదన్నారు. ఎవరో చేసిన తప్పుకు ఇందిరా గాంధీ బహిరంగంగా క్షమాపణ చెప్పారని గుర్తు చేశారు. బుధవారం హైదరాబాద్లోని గాంధీభవన్లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. పెద్ద నోట్లు రద్దు చేయడం తప్పు అనే విషయాన్ని ఇప్పటివరకు మోడీ ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. ప్రధాని మోడీ ప్రతిసారి ఎమర్జెన్సీ గురించి మాట్లాడం సరైంది కాదని మాజీ ఎంపీ వి. హనుమంతరావు అన్నారు. కేవలం ఇందిరా గాంధీపై కక్షతోనే ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు.