మునుగోడును మొదటి స్థానంలో ఉంచాలన్నదే రాజగోపాల్ రెడ్డి లక్ష్యం

– డీసీసీబీ డైరెక్టర్, మునుగోడు పీఏసీఎస్ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి 
నవతెలంగాణ – మునుగోడు
రాష్ట్రంలోని నియోజకవర్గాలలో కంటే మునుగోడు నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి మొదటి స్థానంలో ఉంచాలన్నదే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లక్ష్యం అని డీసీసీబీ డైరెక్టర్ , మునుగోడు పిఎసిఎస్ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి అన్నారు . మండలంలోని కొరటికల్ గ్రామంలో ఎమ్మెల్యే  సహకారంతో 10 లక్షల ఎన్ఆర్ జి ఎస్ నిధులు మంజూరు కావడంతో శుక్రవారం పిఎసిఎస్ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సిసి రోడ్ల నిర్మాణ పనులను శంకుస్థాపన చేశారు . ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు మందుల బీరప్ప , కొరటికల్ గ్రామ శాఖ అధ్యక్షులు దండు లింగస్వామి , మందుల స్వామి , మాజీ సర్పంచ్ అయితగోని బిక్షం , మురారి శెట్టి యాదయ్య గ్రామంలోని కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love