నవతెలంగాణ – హైదరాబాద్ : రైలులో మంటలు చెలరేగాయన్న పుకార్లు ముగ్గురి ప్రాణాలను బలిగొన్నాయి. ఝార్ఖండ్లోని కుమన్డీహ్ రైల్వే స్టేషన్లో జరిగిందీ ఘటన. రాంచీ-ససరామ్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్లో మంటలు అంటుకున్నాయన్న పుకార్లతో ముగ్గురు ప్రయాణికులు భయంతో రైలు నుంచి దూకేశారు. అదే సమయంలో మరో ట్రాక్పై నుంచి వస్తున్న గూడ్స్ రైలు వారిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గత రాత్రి 8 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టు రైల్వే అధికారులు తెలిపారు. రైలులో మంటలు చెలరేగాయని స్టేషన్ మాస్టర్కు ఓ గుర్తు తెలియని వ్యక్తి (ప్రయాణికుడు కాదు) ఫోన్ చేసి చెప్పాడు. దీంతో ఆయన రైలును నిలిపివేశారు. ఆ వెంటనే భయంతో ముగ్గురు వ్యక్తులు ట్రాక్పైకి దూకేశారు. ఈ ఘటనపై రైల్వే అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.