- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: బిహార్కు తొలి బీజేపీ సీఎంగా సామ్రాట్ చౌదరి బుధవారం ప్రమాణం చేశారు. పట్నాలోని లోక్భవన్లో గవర్నర్ సయ్యద్ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి మాజీ సీఎం నితీశ్ కుమార్, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ, జేడీయూ నేతలు హాజరయ్యారు. కాగా నితీశ్ కుమార్ కుమారుడు నిశాంత్ కుమార్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
- Advertisement -



