కుటుంబ సమేతంగా రాజన్నను దర్శించుకున్న సంగారెడ్డి ఎస్పీ..

నవతెలంగాణ – వేములవాడ
దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని ఆదివారం సంగారెడ్డి ఎస్పీ సి రూపేష్ కుటుంబ సమేతంగా  దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడె మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం నాగిరెడ్డి మండపంలో అర్చకులు వేదోక్త ఆశీర్వచనం, స్వామివారి లడ్డూ ప్రసాదం, ఆలయ పర్యవేక్షకులు  బి తిరుపతిరావు ప్రోటోకాల్ పరిరక్షకులు సిరిగిరి శ్రీరాములు అందజేశారు. వారి వెంట ఆలయ ఇన్స్పెక్టర్ చెక్కిళ్ల అశోక్ ,సీఐ కరుణాకర్, ఎస్ఐ దిలీప్ ఉన్నారు.
Spread the love