ఐద్వా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు 

నవ తెలంగాణ  – కంటేశ్వర్
నిజామాబాద్ ఐద్వా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు శనివారం నిర్వహించడం జరిగింది. మహిళలు పిల్లలు పాల్గొని వారి నైపుణ్యాన్ని ప్రదర్శించరు ఈ సందర్భంగా ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి సుజాత మాట్లాడుతూ.. మహిళలపై జరుగుతున్న అగైత్యాలకు వ్యతిరేకంగా పోరాటాలే కాదు పండుగల సందర్భంగా ఆటల పోటీలు ముగ్గుల పోటీలు సదస్సులు నిర్వహించి మహిళని చైతన్యపరిచే విధంగా ఐద్వా కార్యక్రమాలు ఉంటాయని  అందుకు మహిళలు ఐద్వా మహిళా సంఘానికి  మద్దతుగా  ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు అనిత,  జిల్లా నాయకులు లావణ్య, రజియా, నగర నాయకులు శ్రీదేవి, అశ్విని తదితరులు పాల్గొన్నారు.
Spread the love