ఉత్తమ ఉపాద్యాయురాలిని సన్మానించిన సర్పంచ్

నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని లొంగన్ గ్రామము లోని  ఎంపీపీఎస్ పాఠశాల ఉపాద్యాయురాలికి గ్రామస్తులు , గ్రామ సర్పంచ్ నాగలగిద్దే ఉషారాణి మంగళవారం సన్మానించడం జరిగింది. ఈ సంధర్భంగా సర్పంచ్ ఉషారాణీ  మాట్లాడుతు గ్రామములలోని ప్రభూత్వ ఎంపీపీఎస్ పాఠశాల లో విధుల నిర్వహిస్తు మారుమూల జుక్కల్ మండలంలో పేద విద్యార్థులకు విద్యను అందిస్తు, వారి ఙ్ఞానం పెంపోందిస్తున్న కృషిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర మంత్రి సీతక్క చేతుల మీదుగా ప్రశంస పత్రం, ఉత్తమ టీచర్ ఆవార్డు,శాలువాతో సన్మానించడం జరిగింది. గ్రామస్తులు, మహిళ సంఘాల వారు కూడా సన్మానించారు. కార్యక్రమంలో  ఉప సర్పంచ్, , పాఠశాల హెచ్ఎం నీలీమా, గ్రామస్తులు బీఆర్ఎస్ నాయకులు సదుపటేల్  తదితరులు పాల్గోన్నారు.
Spread the love