సొంతగూటికి చేరిన తిప్పాపూర్ సర్పంచ్

నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని తిప్పాపూర్ గ్రామ సర్పంచ్ స్వామి మంగళవారం మాజీ మంత్రి,  మైనార్టీ సంక్షేమ శాఖ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ చేరారు. ఈ సందర్భంగా పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు భీమ్ రెడ్డి, ఎన్నారై సెల్ జిల్లా అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు లింగారెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షులు ధర్మయ్య, తదితరులు పాల్గొన్నారు.

Spread the love