పతి విజయాన్ని కాంక్షిస్తూ సతి ప్రచారం…

– బంధువులతో అర్జున్ సతీమణి ధనలక్ష్మి…
నవతెలంగాణ- అశ్వారావుపే: ఎన్నికల ప్రచారం పర్వం మంగళవారంతో ముగియడంతో పోటీలో నిలిచిన అభ్యర్ధులు అందరూ ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించారు. ఈ క్రమంలో ఎవరికి వారు విజయమే పరమావధిగా ప్రతీ ఓటరును ప్రసన్నం చేసుకున్నారు. ప్రజా సంఘాలు బలపరిచిన సీపీఐ(ఎం) అభ్యర్ధి పిట్టల అర్జున్ ములపకలపల్లి లో పార్టీ శ్రేణులతో ప్రచారంలో పాల్గొనగా ఆయన సతీమణి ధనలక్ష్మి వారి బంధువులతో దమ్మపేట లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు.
Spread the love