- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ రైతులకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం ‘రైతు భరోసా’ పథకం కింద రెండో విడత నిధులను నేడు విడుదల చేయనుంది. సీఎం రేంవత్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం బహిరంగ సభలో బటన్ నొక్కి నిధులు జమ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 45 లక్షల మందికి పైగా రైతులకు సుమారు రూ.5,653 కోట్ల మేర లబ్ధి చేకూరనుంది. గత నెల 23న తొలి విడత నిధులు విడుదల కాగా, ఈ విడతలో రెండో ఎకరం వరకు సాయం అందించనున్నారు.
- Advertisement -



