Monday, April 20, 2026
E-PAPER
Homeతాజా వార్తలుసికింద్రాబాద్ లో భూమిలో నుంచి ఒక్కసారిగా ఎగసిపడ్డ మంటలు

సికింద్రాబాద్ లో భూమిలో నుంచి ఒక్కసారిగా ఎగసిపడ్డ మంటలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : సికింద్రాబాద్ అడ్డగుట్ట పరిధిలోని ఆజాద్ చంద్రశేఖర్ నగర్‌లో అర్థరాత్రి కలకలం రేగింది. మరమ్మత్తుల కోసం తవ్విన రోడ్డులో ఉన్న విద్యుత్ వైర్లు షార్ట్ సర్క్యూట్ కావడంతో భూమి నుంచి ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. జేఎన్‌ఆర్‌ఎం 5వ బ్లాక్ వద్ద జరిగిన ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో బస్తీ మొత్తం చీకటిలో మునిగిపోయింది. సమాచారం ఇచ్చినా విద్యుత్ శాఖ అధికారులు, 100కు కాల్ చేసినా పోలీసులు వెంటనే స్పందించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -