సీఎంపీఎఫ్‌ రీజనల్‌ కమిషనర్‌ను కలిసిన ఐఎన్‌టీయూ సెక్రటరీ జనరల్‌

నవతెలంగాణ-గోదావరిఖని:
సీఎంపీఎఫ్‌ రీజనల్‌ కమిషనర్‌ హరి పచౌరీని ఐఎన్‌టీయూసీ సెక్రటరీ జనరల్‌ జనక్‌ ప్రసాద్‌ గోదావరిఖనిలోని సీఎంపీఎఫ్‌ రీజినల్‌ కార్యాలయంలో శుక్రవారం కలిశారు. కార్మికులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను పరిష్కరిం చాలని ఆయనతో చర్చించారు. ముఖ్యంగా డిజిటలైజేషన్‌ పేరుతో సింగరేణి వ్యాప్తంగా ఉన్న కార్మికులను క్లైమ్స్‌ విషయంలో అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తునారని, గత కొన్ని నెలలుగా ఒక అడ్వాన్స్‌ క్లైమ్‌ కూడా చేయలేదని వారిపై మండిపడ్డారు. దీనిపై సింగరేణి అధికారులతో కూడా ఫోన్‌లో మాట్లాడి సింగరేణి సీఎంపీఎఫ్‌ సమన్వయంతో పనిచేసి వెంటనే క్లైమ్స్‌ ప్రక్రియను, పూర్తి స్థాయిలో డిజిటలైజేషన్‌ చేసి కార్మికులను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.

Spread the love