మధర్ డెయిరీ ఛైర్మన్ గా సీసా నాగేంద్ర స్వామి గౌడ్ ఏకగ్రీవం

నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూర్ గురువారం, మదర్ డెయిరీ చైరన్  గా సీసా నాగేంద్ర స్వామి గౌడ్ ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి గుజ్జ బలరాం తెలిపారు. అంతకు ముందు నూతన డైరెక్టర్లుగా వట్టిపల్లి బాలరాజు గౌడ్, కేతవత్ జయరాం నాయక్ ఎన్నికైయారు. ఈ సందర్భంగా చైర్మన్ సీసా నాగేంద్ర స్వామి మాట్లాడుతూ పాల సంఘం అభివృద్ధికి కృషి చేస్తానన్ని, పాడి రైతులకు అండగా ఉంటానన్ని తెలిపారు. అలాగే తన ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన డైరెక్టర్లకు, పాడి రైతులకు గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సీసా మనోహర్ గౌడ్, సీసా రమేష్, గుండపల్లి వెంకటేష్,  కేతావత్ ఉపేందర నాయక్, వేముల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Spread the love