నవతెలంగాణ-హైదరాబాద్ : ఎంఏ చిదంబరం స్టేడియంలో సౌతాఫ్రికాతో జరుగుతున్న టెస్టు మ్యాచ్లో భారత మహిళా ప్లేయర్ స్నేహ్ రానా సంచలనం సృష్టించారు. మొదటి ఇన్నింగ్స్లో 8, రెండో ఇన్నింగ్స్లో 2 వికెట్లు తీశారు. దీంతో టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒకే మ్యాచ్లో 10 వికెట్లు తీసిన తొలి భారత మహిళా స్పిన్నర్గా స్నేహ్ నిలిచారు. ఫాస్ట్ బౌలర్ జులన్ గోస్వామి తర్వాత 10 వికెట్లు తీసిన 2వ భారత క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పారు.