స్వాతి నక్షత్రం సందర్భంగా పూర్ణగిరిలో ప్రత్యేక పూజలు..

Special pooja in Purnagiri on the occasion of Swati Nakshatra..నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
భువనగిరి మండలంలోని నమాత్ పల్లి గ్రామంలో స్వాతి నక్షత్రం సందర్భంగా  స్వయంభు శ్రీ సుదర్శన పూర్ణగిరి లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. లక్ష్మీనరసింహస్వామి ఉపాసనకులు బత్తిని రాములు గౌడ్ స్వామి ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకం, అష్టోతతరం , అలంకార సేవలు నిర్వహించారు. యాదాద్రి జిల్లా తో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు మూలల నుంచి ఈ క్షేత్రానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తులు గిరి ప్రదక్షిణ అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి పవన్ కుమార్ శర్మ, కుమార్ గౌడ్, పరమేశ్వర్ రెడ్డి, వెంకట్ గౌడ్, గుండాల సత్యనారాయణ, ఇంద్రారెడ్డి,  బత్తిని వెంకటేష్ తో పాటు పలువు భక్తులు పెద్ద ఎత్తున పాలగొన్నారు.

Spread the love