నవతెలంగాణ – గోవిందరావుపేట
స్పోర్ట్స్ పాఠశాలలో అడ్మిషన్ కొరకు నాలుగో తరగతి లోపు విద్యార్థులకు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో గురువారం క్రీడలు నిర్వహించినట్లు మండల విద్యాధికారి గొంది దివాకర్ తెలిపారు. ఈ సందర్భంగా దివాకర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబడుతున్న కరీంనగర్ ,ఆదిలాబాద్, హకీం పేట్, లో గల స్పోర్ట్స్ స్కూల్ లో అడ్మిషన్ కొరకు 4 వ తరగతి లోపు బాల బాలికలకు పలు క్రీడలు నిర్వహించడం జరిగిందన్నారు. మండలం లోని వివిధ పాఠశాల ల బాల బాలికలకు, బ్యాటరీ టెస్ట్, రన్నింగ్, త్రో బాల్, పలు అంశాల్లో ఎంపికలు జరిపి 10 మందిని ఎంపిక చేయడం జరిగింది. వీరిని రేపు ములుగు జిల్లా కేంద్రంలో జరిగే ఎంపికకు పపడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పి డి లు యం సుధాకర్, యాలం ఆదినారాయణ బీ సరిత, ఉపాధ్యాయులు, కన్నయ్య, ఎం ఆర్ సి విష్ణు, సీనియర్ క్రీడాకారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.