బాన్సువాడ మున్సిపాలిటీ చైర్మన్ గా శ్రీహరి రాజు

నవతెలంగాణ – నసురుల్లాబాద్ 
బాన్సువాడ మున్సిపాలిటీ కమిషన్ గా శ్రీహరి రాజు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేసిన హలీం మున్సిపల్ కమిషనర్ ను సస్పెండ్ చేయడంతో సోమవారం బాన్సువాడ మున్సిపాలిటీ చైర్మన్గా శ్రీహరి రాజు బాధ్యతలను స్వీకరించారు. బాన్సువాడలో నిర్వహించిన మున్సిపల్ చైర్మన్ భైంసాలో విధులు నిర్వహిస్తుండగా అవినీతి ఆరోపణలు రావడంతో ఆయనపై  వేటు వేశారు. బాన్సువాడ మున్సిపాలిటీ కమిషనర్ పోస్ట్  కాళీ కావడంతో ఆయన స్థానంలో ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీ హరి రాజు బాన్సువాడ మున్సిపల్ కమిషనర్ గా అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా బాధ్యతలు స్వీకరించిన మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ  ఇటీవల మున్సిపాలిటీలో  10శాతం మున్సిపాలిటీ భూమి పై వచ్చిన అవినీతి ఆరోపణపై ఆయన దృష్టికి తీసుకు వెళ్ళగా తాను విచారణ జరిపి వాస్తవాలు వెలుగులోకి తీసుకొస్తానని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Spread the love