- Advertisement -
నవతెలంగాణ- హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. జూన్ 2, 2014న ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించి తెలంగాణ సాధించిన విజయాలను గుర్తు చేసుకుంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అమరవీరుల త్యాగాల ఫలితమే తెలంగాణ అని, వారి ఆశయాలను సాకారం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం కీలకమని తెలిపారు.
- Advertisement -



