శ్రీ మహంకాళి విగ్రహ ప్రతిష్ట

– అమ్మవారిని దర్శించుకున్న భక్తులు
నవతెలంగాణ – మిరుదొడ్డి 
శ్రీ మహంకాళి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం కన్నుల పండుగ కొనసాగింది. విగ్రహ ప్రతిష్ట లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో నూతన ఆలయం వద్ద ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. దుబ్బాక నియోజకవర్గం లోని మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంలో శ్రీ మహంకాళి ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ట నిర్వహించారు. వేద పండితుల మంత్రోత్సవముల మధ్య అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ప్రతిష్ట మహోత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారి నామస్మరణ చేశారు. ఈ సందర్భంగా పురోహితుడు జయరాం శర్మ మాట్లాడుతూ.. గ్రామంలో నూతనంగా శ్రీ మహంకాళి విగ్రహ ప్రతిష్ట చేయడం శుభ పరిణామం అన్నారు. గ్రామంలో అమ్మవారికి నిత్య పూజలు నిర్వహించడం ద్వారా గ్రామస్తుల తో పాటు పరిసర ప్రాంత గ్రామాల ప్రజలు సుభిక్షంగా ఉంటారన్నారు. విగ్రహ ప్రతిష్ట అనంతరం అమ్మవారికి మహిళలు ఓడి బియ్యం సమర్పించారు. అనంతరం శ్రీ మహంకాళి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం తో పాటు తీర్థప్రసాద వితరణ చేశారు.
Spread the love