లాభాల‌తో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌ : దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగాయి. ప్రపంచ మార్కెట్లలో సానుకూల పవనాలతో మార్కెట్లు మంగళవారం భారీ లాభాల్లో మొదలయ్యాయి. ఆర్థిక, బ్యాంకింగ్ స్టాక్‌లలో లాభాల మద్దతుతో రెండు సూచీలు ప్రారంభ ట్రేడింగ్‌లో సానుకూలంగా ప్రారంభమయ్యాయి. చివరి వరకు అదే ఊపును కొనసాగాయి. కిత్రం సెషన్‌తో పోలిస్తే సూచీలు సెన్సెక్స్‌ 77,529.19 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలయ్యాయి. ఇంట్రాడేలో 78,164.71 పాయింట్ల గరిష్ఠానికి చేరి జీవితకాల గరిష్ఠానికి చేరింది. చివరకు 712.45 పాయింట్లు లాభపడి.. 78,053.52 వద్ద లాభాల్లో ముగిసింది. నిఫ్టీ సైతం ఆల్‌టైమ్‌ గరిష్ఠానికి పెరిగింది.

Spread the love