లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

నవతెలంగాణ-హైదరాబాద్ : భారత స్టాక్ మార్కెట్లు జులై నెలను లాభాలతో ఆరంభించాయి. బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ నేడు లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 443.46 పాయింట్ల వృద్ధితో 79,476.19 వద్ద ముగిసింది. నిఫ్టీ 131.35 పాయింట్లు లాభపడి 24,141.95 వద్ద స్థిరపడింది. టెక్ మహీంద్రా, విప్రో, బజాజ్ ఫైనాన్స్, గ్రాసిమ్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు లాభాలు అందుకోగా… ఎన్టీపీసీ, ఐషర్ మోటార్స్, అపోలో హాస్పిటల్స్, డాక్టర్ రెడ్డీస్, ఎస్బీఐ షేర్లు నష్టాలు చవిచూశాయి.

Spread the love