లింగస్వామిపై దాడి చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి..

నవతెలంగాణ – మునుగోడు
మునుగోడు నియోజకవర్గం లోని సంస్థ నారాయణపురం మండల కేంద్రానికి చెందిన ఫోటోగ్రాఫర్ లింగ స్వామి పై ముక్కుమ్మడి దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ బుధవారం మునుగోడు మండల కేంద్రంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో  నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా ఫోటోగ్రాఫర్స్ మండల అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ.. ఫోటోగ్రఫీ వృత్తిలో ఉన్న మమ్మల్ని సెల్ ఫోన్ లో చిత్రీకరించలేదని మాపై దాడి చేయడం సరైంది కాదని మండిపడ్డారు. సెల్ఫోన్లో చిత్రీకరించడం  మా పని కాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్ మండల అధ్యక్షుడు మాధగోని సైదులు, ప్రధాన కార్యదర్శి కాటం వెంకన్న, గౌరవ అధ్యక్షులు పొట్ల పల్లి యాదయ్య, జాజుల లింగస్వామి,ఉపాధ్యక్షుడు నిమ్మల నాగర్జున,కోశాధికారి నూకల లింగస్వామి, రావిరాల కుమారస్వామి, కోణం మురళి,  విజయ్,శ్రీశైలం, రావుల శ్రీను,, వసంతు, మల్లికార్జును, రమేష్ నరేష్ స్వామి, వినయ్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love