నవతెలంగాణ-హైదరాబాద్ : మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవర్ నేతృత్వంలోని ఎన్సీపీకి మోడీ కొత్త క్యాబినెట్లో మొండిచేయి ఎదురైంది. లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి గెలిచిన ఒక్క ఎంపీ ప్రఫుల్ పటేల్కు కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలని అజిత్ పవార్ డిమాండ్ చేశారు. అయితే కొత్త క్యాబినెట్లోకి ఆయనను తీసుకోలేదు. ఈ నేపథ్యంలో కొన్ని రోజులు వేచి ఉంటామని అజిత్ పవార్ అన్నారు. ఆదివారం ఈ అంశంపై మీడియాతో ఆయన మాట్లాడారు. తమ పార్టీకి కేంద్ర సహాయ మంత్రి పదవిని ఆఫర్ చేశారని తెలిపారు. అయితే క్యాబినెట్ పోస్ట్ మాత్రమే తమకు కావాలని చెప్పామన్నారు. దీని కోసం కొన్ని రోజులు ఎదురుచూస్తామని చెప్పారు. ‘మాకు ఇవాళ ఒక లోక్సభ, ఒక రాజ్యసభ ఎంపీ ఉన్నారు. రానున్న రెండు మూడు నెలల్లో రాజ్యసభలో ముగ్గురు సభ్యులు మాకు ఉంటారు. పార్లమెంటులో మా ఎంపీల సంఖ్య నాలుగు అవుతుంది. కాబట్టి మాకు ఒక క్యాబినెట్ మంత్రిత్వ శాఖ సీటు ఇవ్వాలని అడిగాం’ అని అన్నారు.