రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థ గురించి తెలుసుకుంటున్న విద్యార్థులు

నవతెలంగాణ – రాయికల్
రైల్వే స్టేషన్ ను సందర్శించిన  కృష్ణవేణి విద్యార్థులు పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు బుధవారం లింగంపేట లో గల రైల్వే స్టేషన్ సందర్శించి స్టేషన్ మాస్టర్ ద్వారా రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థ గురించి తెలుసుకున్నారు.రైలు నడుస్తున్నప్పుడు స్థానిక స్టేషన్ తో సమన్వయం ఎలా ఉంటుంది, రైలు  లో ఉండే వివిధ రకాల భోగిల గురించి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో  రైల్వే సిబ్బంది,పాఠశాల ప్రిన్సిపాల్ జె. వేణుగోపాలరావు, ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.
Spread the love