- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : 17వ తమిళనాడు శాసనసభ సమావేశాలు రేపు ఉదయం 9:30 గంటలకు ప్రారంభంకానున్నాయి. తాత్కాలిక స్పీకర్ సమక్షంలో కొత్త ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎల్లుండి కొత్త స్పీకర్ ఎన్నిక నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అనంతరం విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం అసెంబ్లీలో మెజార్టీ నిరూపించుకోనుంది. దీంతో తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలకు రంగం సిద్ధమవుతోంది.
- Advertisement -



